కేపీ జగన్నాథపురంలో పెద్దమ్మ తల్లి హుండీ ఆదాయం రూ.23 లక్షలు

  కేపీ జగన్నాథపురంలో పెద్దమ్మ తల్లి హుండీ ఆదాయం రూ.23 లక్షలు

పాల్వంచ, వెలుగు : మండలంలోని కేపీ జగన్నాథపురంలో ఉన్న కనక దుర్గ పెద్దమ్మతల్లి దేవాలయం హుండీని గురువారం లెక్కించారు. ఈవో రజనీకుమారి, మణుగూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయ ఈవో సుదర్శన్, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వర రావు, ధర్మకర్తలు చీకటి కార్తీక్, చెవుగాని పాపారావు ధర్మరాజుల నాగేశ్వరరావు, సందుపట్ల రమ్య, పెండ్లి రామిరెడ్డి, భూక్య గిరిప్రసాద్, అసుమల్లి సాయిబాబా, చెరు కూరి శేఖర్ బాబు, దుగ్గిరాల సు ధాకర్  పర్యవేక్షణలో కానుకలను లెక్కబెట్టారు. 80 రోజులకు గాను 23,42,780 ఆదాయం రాగా, రెండు విదేశీ నోట్లు,16 విదేశీ నాణాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

హుండీలో వేసిన మిశ్రమ బంగారం, వెండి ఆభరణాలను మూటగట్టి తిరిగి హుండీలోనే వేసినట్లు ఈవో రజనీకుమారి తెలిపారు. కానుకల లెక్కింపులో కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్, సిబ్బంది, రూరల్ పోలీ స్ స్టేషన్ సిబ్బంది, వివిధ సేవా సంస్థ లకు చెందిన మొత్తం 75 మంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఆలయంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహానికి 108 బంగారు పుష్పాలతో అర్చ కులు సువర్ణ పుష్పార్చన పూజ లను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.