రాజుపేటలో ముగిసిన పెద్దమ్మ తల్లి కొలుపు..నిప్పుల గుండంలో నడిచిన భక్తులు

రాజుపేటలో ముగిసిన పెద్దమ్మ తల్లి కొలుపు..నిప్పుల గుండంలో నడిచిన భక్తులు

ములకలపల్లి, వెలుగు  : మండలంలోని రాజుపేటలో ఆరు రోజులుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పెద్దమ్మతల్లి కొలుపు ఆదివారం ఘనంగా ముగిసింది. రాజుపేట, ములకలపల్లి, విజయపురి కాలనీ, చర్చి ఏరియాలలో ఊరేగింపు నిర్వహించి శనివారం సరువుల జాతరతో గ్రామ పొలిమేర్ల కట్టడితో తొలి పూజలు ముగిశాయి. అంతకుముందు అమ్మవారిని ఊరేగించి  గ్రామ బొడ్రాయి వద్ద సంప్రదాయ పద్ధతిలో గణాచారులు కల్యాణ తంతును నిర్వహించారు.

అనంతరం ఆలయ వద్దకు మేళంతో చేరుకొని నిప్పుల గుండంలో మూడుసార్లు నడిచి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గణాచారులు బీబీనేని సాంబయ్య,  వీరయ్య, రెడ్డి వెంకన్న, బింగి శేషగిరి, రెడ్డి మంగతాయారు, నాగరాజు, రాజమ్మ, సోమిని అచ్చయ్య, రెడ్డి కృష్ణ, రెడ్డి వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, నరసింహ తదితరులు పాల్గొన్నారు