పెద్దపల్లి జిల్లాలో లంచం తీసుకుంటూ .. ఏసీబీకి పట్టుబడిన పీఆర్ఏఈ

పెద్దపల్లి జిల్లాలో లంచం తీసుకుంటూ .. ఏసీబీకి పట్టుబడిన పీఆర్ఏఈ

పెద్దపల్లి, వెలుగు: లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్  పీఆర్​ ఏఈ జగదీశ్​ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. ఓదెల మండలం బాయమ్మపల్లికి చెందిన కాంట్రాక్టర్​ రాజుకు సీసీ రోడ్డు పనులకు సంబంధించిన రూ. 15 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. 

ఈ బిల్లుల కోసం ఏఈ రూ.90 వేలు డిమాండ్​ చేయగా, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శనివారం కాల్వశ్రీరాంపూర్​ వెళ్లే రోడ్డుపై డబ్బులు ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. జగదీశ్​ను అరెస్ట్​ చేసి, కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయకుమార్​ తెలిపారు.