గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో.. పెద్దపల్లి జిల్లాలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర 51 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అర్సలన్ అన్సారీ పెద్దపల్లిలోని అమర్ నగర్ వెల్డింగ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

అర్సలన్ అన్సారీ చెడు అలవాట్లకు, గంజాయికి బానిసై గంజాయి చాక్లెట్లు తినడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే గంజాయి చాక్లెట్ల బిజినెస్ ప్రారంభించాడు. ఉత్తర ప్రదేశ్ లో ఓ వ్యక్తి దగ్గర గంజాయి చాక్లెట్స్ కొనుగోలు చేసి.. పెద్దపల్లి ప్రాంతంలోని అమాయకపు స్టూడెంట్స్, యువతకి ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని గుర్తించారు.