వివేక్ సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు

వివేక్ సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు

రాష్ట్రంలో బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల నుంచి భారీగా నేతలు కమలం గూటికి చేరుతున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి నుంచి బీజేపీలో చేరడానికి నేతలు హైదరాబాద్ బయలు దేరారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వీరంతా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడుతున్న వివేక్ వెంకటస్వామికి మద్దతుగా నిలుస్తామని నేతలు చెప్పారు.