రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా లో నిన్న రాత్రి  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్​పై వెళ్తున్న ముగ్గురు యువకులు ఓదెల మండలం కొలనూర్ రైల్వే గేటు వద్ద గోపరపల్లె గ్రామ శివారులో ప్రమాదానికి గురయ్యారు. మూల మలుపు వద్ద బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఇందులో గోపరపల్లి గ్రామానికి చెందిన దాసరి వంశీకృష్ణారెడ్డి (18), పెగడపల్లి గ్రామానికి చెందిన జీల మహేశ్​((19) మరణించారు.

సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లాంపల్లి  గ్రామానికి చెందిన సంజయ్ అనే యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా అతడిని చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.