
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తవగా, మరోవైపు ప్రమోషన్స్లోనూ జోరు పెంచేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. వినాయక చవితి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి సెకండ్ సాంగ్ షూటింగ్ కోసం దర్శకుడు బుచ్చిబాబు పెద్ద ప్లాన్ వేశాడని తెలుస్తోంది. ఈ సాంగ్ను శ్రీలంకలో చిత్రీకరించనున్నారట.
ఇప్పటికే టీమ్ అంతా శ్రీలంకకు పయనమైనట్టు సమాచారం. రామ్ చరణ్, జాన్వీ కపూర్పై వచ్చే ఈ మాంటేజ్ సాంగ్ కేవలం పాటలా మాత్రమే కాకుండా కథను ముందుకు తీసుకెళ్లేలా డిజైన్ చేశారట. దీనికోసం ఏఆర్ రెహమాన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ను కంపోజ్ చేసే పనిలో ఉన్నారట. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.