మరింత అందంగా సప్త సాగరాలు దాటి సైడ్ బి

మరింత అందంగా సప్త సాగరాలు దాటి సైడ్ బి

కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా హేమంత్ ఎ.రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సప్త సాగరాలు దాటి’ సైడ్ ఎ పేరుతో రీసెంట్‌‌‌‌‌‌‌‌గా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నవంబర్ 17న సైడి బి పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌కి దర్శకులు అనుదీప్, శ్రీనివాస్ అవసరాల ముఖ్య అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. 

రక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నా గత చిత్రాలు అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ, సప్తసాగరాలు సైడ్ ఎ సినిమాలను బాగా ఆదరించారు. ఈ చిత్రాన్ని కూడా కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నాడు. సైడ్ ఎ కంటే  సైడ్‌‌‌‌‌‌‌‌ బిలో మరిన్ని అందమైన పాత్రలు ఉంటాయని, ప్రేక్షకులని మెప్పిస్తుందని చెప్పారు హీరోయిన్స్ రుక్మిణీ వసంత్, చైత్ర. తమ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ధన్యవాదాలు అని చెప్పాడు హేమంత్.  సైడ్ ఎ కంటే సైడ్ బి పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం అని వివేక్ కూచిభొట్ల అన్నారు.