పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : రమేశ్​

పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి :  రమేశ్​

మెదక్​టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్​కలెక్టర్​రమేశ్​ పేర్కొన్నారు. కలెక్టరేట్​లో శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అర్హులైన వారికి లోన్లు మంజూరు చేయాలన్నారు.

 ఎంపికైనవారికి వారం రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. జిల్లా పరిశ్రమల అధికారి  కృష్ణమూర్తి , ఎంఎస్​ఎంఈ ఏడీ దశరథ్, డీపీవో యాదయ్య, మెప్మా పీడీ ఇందిర, ఎల్​డీఎం నర్సింహమూర్తి పాల్గొన్నారు.