ప్రజల మనిషి విష్ణువర్ధన్ రెడ్డి : మద్దతుగా కొమురక్క ప్రచారం

ప్రజల మనిషి విష్ణువర్ధన్ రెడ్డి : మద్దతుగా కొమురక్క ప్రచారం

షాద్ నగర్, వెలుగు: తండాల్లో ప్రజల దాహర్తిని తీర్చడానికి వాటర్ ప్లాంట్‌‌లు నిర్మించి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న భగీరథుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అని జబర్దస్త్ ఫేమ్ కొమురక్క అన్నారు.  శనివారం కడియాల కుంట తండా, బుర్ర గడ్డ తండా, తిమ్మాజి పల్లి తండా, తీగాపూర్, పెంజర్ల గ్రామాల్లో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొమురక్క మాట్లాడుతూ.. ప్రజల మనిషి విష్ణువర్ధన్ రెడ్డి అని, కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తన్నారు.  కరోనా కాలం సమయంలో మొన్నటి వరకు తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు అండగా ఉన్నారని అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మోహన్ సింగ్, మల్ రెడ్డి మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాయక్ తదితరులున్నారు.