పెరూలో బస్సు బోల్తా..20 మంది మృతి

పెరూలో బస్సు బోల్తా..20 మంది మృతి

పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  సోమవారం బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 20 మంది చనిపోయారు. ఈ ఘటన ఉత్తర అంకాష్‌ ప్రాంతలోని సిహ్వాస్‌ ప్రావిన్స్‌లో జరిగింది.  ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ఇంకా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఆదివారం పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లి తిరిగి వస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది  సహాయ కార్యక్రమాలు చేపట్టారు.