జీడిమెట్ల, వెలుగు: భూకబ్జాకు ప్రయత్నించిన అధికార పార్టీ తూంకుంట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్ పర్సన్ భర్తతోపాటు పలువురిపై పేట్బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ సర్వే నంబర్ 641లో సంగారెడ్డికి చెందిన బగ్లీ వీరశెట్టప్ప అనే వ్యక్తి 10 ఎకరాల 9 గుంటల భూమిని వీరయ్య అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. అనంతరం ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి వాచ్మెన్ను పెట్టుకున్నాడు.
అయితే, తూం కుంట మున్సిపల్ చైర్మన్ కారింగుల రాజేశ్వర్రావు, వైస్ చైర్ పర్సన్భర్త పన్నాల వీరారెడ్డి మరో ఐదుగురు ఆ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి కంచెను ధ్వంసం చేశారు. దీంతో స్థలం యజమాని ఫిర్యాదుతో రాజేశ్వర్రావు, వీరారెడ్డితోపాటు పెండం లక్ష్మీనారాయణ, శంకర్గౌడ్, అశోక్, శంకర్, యాదగిరిపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
