హైదరాబాద్‌లో సెంచరీ దాటిన డీజిల్ ధర

హైదరాబాద్‌లో సెంచరీ దాటిన డీజిల్ ధర

దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వరుసగా ఐదో రోజు ఫ్యుయల్ రేట్లు పెరగడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ఆయిల్ కంపెనీలు లీటరు పెట్రోల్‌పై 29.-30 పైసలు, లీటర్ డీజిల్ మీద 35.-38 పైసలు పెంచాయి. పెరిగిన ధరలను బట్టి.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.103.24, లీటర్ డీజిల్ రూ. 91.77గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.109.25, డీజిల్ రూ .99.55గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ .100.75, డీజిల్ రూ. 96.26గా ఉంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ రేట్ రూ. 107.40, డీజిల్ ధర రూ. 100.13గా ఉంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో అత్యధికంగా పెట్రోల్ రేట్ 109.77గా, డీజిల్ ధర రూ.102.34గా ఉండటం గమనార్హం. 

మరిన్ని వార్తల కోసం: 

పాతబస్తీ ప్రజలను వేధిస్తే ఊరుకోను: అసదుద్దీన్ ఒవైసీ 

కంప్లయింట్ ​చేసినందుకు కుల బహిష్కరణ

దళితబంధు పథకాన్ని బీజేపీ వ్యతిరేకించలేదు