- 16 రోజుల్లో రూ.8పెరిగిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: చమురు కంపెనీలు వరుసగా 16వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. సోమవారం దేశ రాజధానిలో పెట్రోల్ ధర రూ.79.56 కాగా.. డీజిల్ ధర 78.85కి చేరింది. గత 16 రోజుల్లో పెట్రలో ధర లీటర్కు రూ. 9.21, డీజిల్ ధర లీటర్కు రూ.8.55 పెరిగింది. దేశంలోని వివిధ పట్టణాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
నగరం పెట్రోల్ డీజిల్
హైదరాబాద్ 82.59 77.06
ఢిల్లీ 79.56 78.85
కోల్కతా 81.27 74.14
ముంబై 86.36 77.24
చెన్నై 82.87 76.30