28 నుంచి పీజీ ఈసెట్ కౌన్సెలింగ్

28 నుంచి పీజీ ఈసెట్ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం 28న అడ్మిషన్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌‌లో చైర్మన్ ఆర్.లింబాద్రి నేతృత్వం లో పీజీఈ సెట్ అడ్మిషన్లపై సమావేశం జరి గింది. ఈ సందర్భంగా షెడ్యూల్ రిలీజ్ చేశారు. 

ఈనెల 31 నుంచి ఆగస్టు18 దాకా ఆన్‌‌లైన్ రిజిస్ట్రేషన్‌‌తో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. ఆగస్టు 21 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, 24న ఎడిట్ ఆప్షన్ ఉంటుందని తెలిపారు. ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఆగస్టు 26న నిర్వహిస్తామన్నారు. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 4 నుంచి 23 దాకా కొనసాగనుంది. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, 16న సీట్ల అలాట్​మెంట్​ ఉంటుందని పేర్కొన్నారు.