
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణను ముమ్మరం చేసింది. ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ SIB చీఫ్ ప్రభాకరరావును ఇప్పటికే మూడుసార్లు విచారించిన సిట్ నాలుగోసారి విచారణకు సిద్దమయ్యారు. మరికాసేపట్లో (జూన్ 19 ఉదయం 11 గంటల ప్రాంతంలో) జూబ్లీహిల్స్ పీఎస్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈరోజు (జూన్ 19) ప్రభాకర్ రావు ను సిట్ అధికారులు విచారించనున్నారు.
కొంతమంది అధికారులు.. సాక్షులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ప్రభాకరరావును విచారించారు. సాక్షుల వాంగ్మూలంతో వివరాలు సేకరించిన సిట్ అధికారుల బృందం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో రివ్యూ కమిటి నుంచి వివరాలు సేకరించే పనిలో ఉంది. రివ్యూ కమిటీ సభ్యులుగా హోమ్ శాఖ మాజీ సెక్రెటరీ, డీజీపీ జితేందర్, ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ అనిల్ నుండి వివరాలను సేకరిస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్ కు పంపిన నెంబర్ ల పై ఆరా తీసిన బృందం ..రివ్యూ కమిటీ సభ్యుల నుంచి లిఖితపూర్వకంగా వివరాలు తీసకోనున్నట్లు సమాచారం అందుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకరరావు టీం .. మావోయిస్టు సానుభూతిపరులని ఇచ్చిన ఫోన్ నెంబర్ లు ట్యాపింగ్ కు అనుమతి ఇవ్వడం పై స్టేట్ మెంట్ రికార్డ్ చేసింది.
నిబంధనల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్ కే అధికారం ఉంటుంది. గత ప్రభుత్వంలో పదవీ విరమణ పొందిన ప్రభాకరరావును ఓఎస్డీ గా... ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్ కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించిన విషయంలో ఆరా తీస్తుంది... వాస్తవానికి డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం ఉంది. ఇంకా నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తీసుకోవాలి.
కాని మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకరరావు నిబంధనలకు విరుద్దంగా.. ఆయన ఇష్టం వచ్చినట్లు.. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని సిట్ విచారణలో గుర్తించింది. ఈ కేసులో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు స్టేట్ మెంట్ లు కీలకంగా మారాయి.