
పద్మారావునగర్, వెలుగు: ఓ ప్రయాణికుడి ఫోన్చోరీ చేసిన దుండగుడు అందులోని రెండు బ్యాంక్అకౌంట్లలో ఉన్న రూ.6 లక్షలను మాయం చేశాడు. బోయిన్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన ప్రసాద్ రావు సోమవారం బోయిన్ పల్లి లో నాందేడ్ కు చెందిన బస్ ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని సెల్ ఫోన్ ను దొంగిలించాడు.
తర్వాత ఫోన్పోయిన విషయం తెలుసుకున్న బాధితుడు బోధన్ లో కొత్త మొబైల్కొనుగోలు చేశాడు. పాత నంబర్ పైనే సిమ్ కార్డు తీసుకున్నాడు. అయితే ఫోన్లో కొత్త సిమ్ కార్డు వేయగానే అతని బ్యాంక్అకౌంట్ల నుంచి డబ్బులు డెబిట్అయినట్లు మెస్సేజ్లు వచ్చాయి. దీంతో బాధితుడు మంగళవారం బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.6 లక్షలు విత్ డ్రా అయ్యాయని పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.