రిపబ్లిక్ డే వేడుకల్లో అంబేద్కర్ ఫొటోలు పెట్టాలి: జంగా శ్రీనివాస్

రిపబ్లిక్ డే వేడుకల్లో అంబేద్కర్ ఫొటోలు పెట్టాలి:  జంగా శ్రీనివాస్

ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఫొటోలను పెట్టాలని తెలంగాణ మాల యోధులు వ్యవస్థాపక అధ్యక్షుడు జంగా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... రిపబ్లిక్ డే రోజున అంబేద్కర్ ఫొటోలు పెట్టేలా ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రవీణ్ కుమార్, సూర్య ప్రతాప్, నర్సింహ, పవన్ కుమార్, నరేందర్, సాయి చంద్ర ఉన్నారు.