అట్టడుగు ప్రజలకు అభివృద్ధి ఫలాలు : పీయుష్

అట్టడుగు ప్రజలకు అభివృద్ధి ఫలాలు : పీయుష్

ఢిల్లీ : అభివృద్ధి ఫలాలు దేశంలోని అట్టడుగు ప్రజల వరకు చేరాలన్నదే తమ లక్ష్యమన్నారు కేంద్రమంత్రి పీయుష్ గోయల్. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా బడ్జెట్ తయారు చేశామన్నారు. ఈ సారి రెండు కొత్త పథకాలు ప్రకటించామని చెప్పారు గోయల్. అయితే.. మధ్యంతర బడ్జెట్ కావడం వల్ల పూర్తి స్థాయిలో ప్రతిపాదనలకు న్యాయం చేయలేకపోయామన్నారు. ప్రతి వర్గానికి మేలు కలగాలనేది ప్రధాని మోడీ ఆశయమని తెలిపారు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

‘రైతులకు ఏటా రూ.6వేలు చెల్లించాలనే నిర్ణయం చారిత్రాత్మకమైనది. సంవత్సరానికి రూ.6వేల ఆర్థిక సహాయం చిన్న రైతులకు గొప్ప ఊరట. ఆర్థిక క్రమశిక్షణ పాటించి, నిధులు పొదుపు చేసి రైతులకు మేలు చేస్తున్నాం. రైతుల కోసం మేం తీసుకున్న నిర్ణయం ఎవరూ తీసుకోలేదు. 12.5 కోట్ల మంది రైతులకు ఈ స్కీంతో మేలు కలుగుతుంది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 2018 డిసెంబరు నుంచే అమలు చేయాలని నిర్ణయించాం. పింఛన్‌ స్కీంతో కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతుంది. ముద్ర రుణాలతో కార్మికులను ఆదుకున్నాం. నామమాత్రమైన రూ.100 ప్రీమియం చెల్లిస్తే రూ.3వేలు పింఛను ఇస్తాం’ అని తెలిపారు పీయూష్‌ గోయల్‌.