నవంబర్ 26న తూప్రాన్​, నిర్మల్​లో ప్రధాని మోదీ సభలు

నవంబర్ 26న తూప్రాన్​, నిర్మల్​లో ప్రధాని మోదీ సభలు

హైదరాబాద్,వెలుగు:  తెలంగాణలో  బీజేపీ అగ్రనేతల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఆదివారం రాష్ట్రంలో పర్యటించనున్నారు.  ప్రధాని మోదీ మధ్యాహ్నం 2 గంటలకు తూప్రాన్​లో, 3.30 గంటలకు నిర్మల్ సభల్లో  పాల్గొననున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా  5 నియోజకవర్గాల్లో  ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ఉదయం 11.15 గంటలకు మక్తల్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ కుంటలో, ఒంటి గంటకు మునుగోడు, 2 గంటలకు ములుగు, మధ్యాహ్నం 3.45 గంటలకు భువనగిరి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఉదయం 11.30 గంటలకు మహబూబ్ నగర్,  1.15 గంటలకు కల్వకుర్తి,   3.15 గంటలకు ఎల్ బీ నగర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.