- సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని విషయాల్లో విఫలమయ్యారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. నగరంలో జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామ్ ఏచూరి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత భారీగా పెరిగిందన్నారన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు.
సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీజేపీని వ్యతిరేకిస్తూనే... కలిసి వచ్చే వారితో ముందుకెళ్తామన్నారు. బిజెపి సాఫ్ట్ కార్నర్ కు తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు.
ఇవి కూడా చదవండి
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి చూస్తుంటే కంట్లో నీళ్లొస్తున్నాయి
ల్యాప్టాప్ వాడుతున్నారా? ఈ గాడ్జెట్స్ మీ కోసమే