మీ అంతరిక్షయాత్ర..నవయుగానికి శుభారంభం:శుభాన్షు శుక్లాతో ప్రధాని మోదీ సంభాషణ

మీ అంతరిక్షయాత్ర..నవయుగానికి శుభారంభం:శుభాన్షు శుక్లాతో ప్రధాని మోదీ సంభాషణ

అంతర్జాతీయ స్పేస్​ స్టేషన్​లో పరిశోధనలు చేస్తున్న మొదటి భారతీయ వ్యోమగామి శుభాన్ష్​ శుక్లాతో ప్రధాని మోదీ ఇంటరాక్ట్​ అయ్యారు. ఆక్సియం–4 మిషన్​ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాన్ష్​ శుక్లాతో ప్రధాని మోదీ శనివారం (జూన్​28) మాట్లాడారు. మీరు ఈరోజు మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ 140కోట్ల భారతీయు హృదయాలకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. మీ పేరులో శుభం ఉంది.. మీ యాత్రకూడా నవయుగానికి శుభారంభం అవుతుంది”ప్రధాని మోదీ శుభాన్ష్​ శుక్లాను అభినందించారు. 

1984 ఏప్రిల్ 3న సోవియట్ సోయుజ్ T-11లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ చేసిన చారిత్రాత్మక మిషన్ తర్వాత..41 యేళ్ల తర్వాత 'కర్మన్ లైన్(గురుత్వాకర్షణ అవధులు) దాటిన మొదటి భారతీయుడు శుక్లా. అంతరిక్షం నుంచి శుక్లా ఒక మేసేజ్​ ను షేర్​ చేశారు. "ఇది ISSకి నా ప్రయాణ ప్రారంభం కాదు. భారతదేశం మానవ అంతరిక్ష విమాన కార్యక్రమం ప్రారంభం." అని అన్నారు శుక్లా. 

#WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.

PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3

— ANI (@ANI) June 28, 2025

భారత్​, హంగేరీ, పోలాండ్​, యూఎస్​ నుంచి నలుగురు వ్యోమగాములతో కూడిన అంతరిక్ష మిషన్​ ఆక్సియం –4 గురువారం సక్సెస్​ఫుల్​ గా ప్రయోగించారు. భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్దు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. 1.4 బిలియన్ భారతీయుల కోరికలు, ఆశలు ,ఆకాంక్షలను తనతో తీసుకెళ్లారు.

అంతరిక్ష నౌకలోని ఆక్సియం 4 మిషన్  డ్రాగన్​క్యాప్సూల్​ గురువారం ISS కు విజయవంతంగా డాక్ చేశారు. షెడ్యూల్ కంటే ముందే సాయంత్రం 4:05 గంటలకు (IST) అంతరిక్ష కేంద్రం హార్మొనీ మాడ్యూల్ అంతరిక్ష-ముఖ పోర్టుకు స్వయంగా డాకింగ్ అయింది. 

ఐఎస్ఎస్ లోని ఏడుగురు సభ్యులతో కూడిన ఎక్స్​ పెడిషన్​ 73 బృందం యాక్స్-4 సిబ్బందికి స్వాగతం పలికింది. సెక్యూరిటీ బ్రీఫింగ్​ లో పాల్గొంది.  నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్, ఇస్రో వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్దు శుక్లా, ESA వ్యోమగాములు పోలాండ్​ కు చెందిన స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ ,హంగేరీకి చెందిన టిబోర్ కాపు ఆక్సియమ్ 4 మిషన్ కోసం సిబ్బందిలో ఉన్నారు.

ISS కి చేరుకున్న తర్వాత గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతరిక్షంలో 634వ మానవుడిగా ,ISS లోకి ప్రవేశించిన మొదటి భారతీయుడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతరిక్ష ప్రయాణం అద్భుతమైన ఆపర్చునిటీగా అభివర్ణించాడు శుభాన్ష్​ శుక్లా.