తాజ్‌మహల్‌ని కూడా అమ్మేస్తారేమో!

తాజ్‌మహల్‌ని కూడా అమ్మేస్తారేమో!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీపై టార్గెట్‌గా విమర్శలకు దిగారు. మంగళవారం జంగ్‌పురాలో ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఆగ్రాలోని తాజ్‌మహల్‌ని కూడా అమ్మేస్తారేమోనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక హింసను రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి చేసింది లేదన్నారాయన.

మేకిన్ ఇండియా అంటూ ప్రధాని మోడీ చాలా మంచి నినాదాన్ని అందించారని అన్నారు రాహుల్ గాంధీ. అయితే ఆ స్లోగన్‌కు తగ్గట్టుగా యూపీలోని ఆగ్రాలో ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టలేదని చెప్పారు. ఇండియన్ ఆయిల్, ఎయిరిండియా, హిందుస్థాన్ పెట్రోలియం, రైల్వేస్, ఆఖరికి ఎర్రకోట ఇలా ప్రతిదీ అమ్ముకుంటూ పోతున్నారని అన్నారు. భవిష్యత్తులో మోడీ తాజ్‌మహల్‌ని కూడా అమ్మేస్తారేమోనని అన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ దేశంలో హింసను రెచ్చగొడ్డమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఏ ఒక్క మత గంధం కూడా హింసను ప్రోత్సాహించదని, మోడీకి అసలు ఏ మతం గురించీ అవగాహన లేదని అన్నారు రాహుల్.