రేపు ఢిల్లీలో మోడీ రోడ్ షో.. ట్రాఫిక్ మళ్లింపు

రేపు ఢిల్లీలో మోడీ రోడ్ షో.. ట్రాఫిక్ మళ్లింపు

ప్రధాని నరేంద్రమోడీ సోమవారం ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు. మోడీ ర్యాలీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రహదారులను మూసివేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30ల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మోడీ రోడ్ షో జరగనుంది. సంసద్ మార్గ్‭లో పటేల్ చౌక్ నుండి సంసద్ మార్గ్ జై సింగ్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముంది. ఈ క్రమంలో రోడ్ షో జరగనున్న ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్ షోలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మోడీకి స్వాగతం పలికేందుకు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.