మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ సీరియస్..

మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ సీరియస్..

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నం ఊరేగించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కఠినంగా శిక్షిస్తామని మోదీ అన్నారు. మణిపూర్ ఘటన సిగ్గుపడాల్సిన విషయం.. ఇలాంటి దురాగతాలను సహించమని ప్రధాని అన్నారు. తక్షణమే ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియానుంచి తొలగించాలని ఆదేశించారు.  మహిళలను గౌరవించే సంస్కృతి మనది.. ఇలాంటి ఘటనలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు మణిపూర్ ఘటనపై విపక్షాలు మండిపడ్డాయి. 

మే4న  మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘటన జరిగింది. కాంగ్ పోక్సి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.