
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మోదీ సిక్కిం నుంచి బెంగాల్కు చేరుకుంటారు.
కూచ్బెహార్ జిల్లాలో గ్యాస్ పంపిణీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 2.5 లక్షల ఇండ్లు, 100కిపైగా పరిశ్రమలకు పైప్లైన్ ద్వారా నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే లక్ష్యంతో వెయ్యి కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అలీపుర్దువార్ జిల్లాలో జరిగే ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం పాట్నాకు బయలుదేరుతారు.