- వందేమాతరం, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీ వైట్ హౌస్ కు వచ్చిన సందర్భంగా తెలుగువారితో పాటు ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మొత్తం రెండు వేల నుంచి మూడు వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైట్ హౌస్ లోని సౌత్ లాన్ ప్రాంగణమంతా ఎన్నారైలతో కిటకిటలాడింది. మోదీ కార్యక్రమానికి హాజరు కావడానికి అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్నారైలు ముందే అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు ‘వందేమాతరం, భారత్ మాతా కీ జై, మోదీ మోదీ’ అంటూ నినాదాలు చేశారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ కమ్యూనిటీ లీడర్లు ప్రదీప్ కట్టా, విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల, రఘువీర్ రెడ్డి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ లీడర్లు మధుకర్ రెడ్డి, ప్రశాంత్ నలుబంధు, సుధాకర్ గట్టు, తెలంగాణ డెవలపర్ ఫోరం మాజీ అధ్యక్షుడు మురళీ చింతపల్లి, బీజేపీ మాజీ ప్రెసిడెంట్ కృష్ణా రెడ్డి, రాజేందర్ రావు, భీమా పెంట, ఆదిత్య రాయుడు, కేఎస్ఎస్ రాజు, రామకృష్ణ, శ్రీనివాస్, కృష్ణ గుడిపాటి, నిర్మలా రెడ్డి, పృథ్వీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.