
హైదరాబాద్, వెలుగు: ఎంఎంటీఎస్ నెట్వర్క్ 90 కిలోమీటర్లకు పెరగడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్-సికింద్రాబాద్ ప్రజలకు, శివారు ప్రాంతాల వారికి ఎంఎం టీఎస్ సేవలు ఎంతో ఉపయోగపడతా యని శుక్రవారం ట్వీట్ చేశారు. ఎంఎంటీఎస్ నెట్వర్క్ పెరగడంతో ఓ ఇంగ్లిష్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ను దక్షిణ మధ్య రైల్వే అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేయగా, ఆ ట్వీట్కు ప్రధాని రీ ట్వీట్ చేశారు. ఈనెల 8న మోడీ హైదరాబాద్ పర్యటనలో సికిం ద్రాబాద్-మేడ్చల్, ఫలక్నుమా-ఉందా నగర్ మధ్య ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా కొత్త ట్రైన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే.