
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించారు. 25 అడుగుల ఈ విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్ లక్నోలోని లోక్ భవన్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాజ్ పేయికి మోడీ ఘన నివాళి అర్పించారు.
ఆ తర్వాత అటల్ బిహారీ మెడికల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు.