మోదీ యూఏఈ పర్యటన.. బుర్జ్ ఖలీఫాపై మువ్వన్నెల జెండా..

మోదీ యూఏఈ పర్యటన.. బుర్జ్ ఖలీఫాపై మువ్వన్నెల జెండా..

యూఏఈ ఒక రోజు పర్యటనలో భాగంగా అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం లభించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ప్రధానికి ఘనస్వాగతం పలికారు. పర్యటలో భాగంగా శనివారం ఇరు దేశాల నేతలు సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా  దుబాయ్ లో  ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం ఖలీఫా టవర్ పై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ అద్బుత దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.  

ప్రధాని మోదీ పర్యటన సందర్బంగా దుబాయ్ లో ఖలీఫా టవర్ పై భారత జాతీయ జెండా రంగులను ప్రదర్శించారు. దుబాయ్ ఆకాశ హర్మ్యంపై మువ్వన్నెల జెండా రంగుల్లో వెలుగుతున్నట్లు చూపిస్తున్న వీడియో  సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటోంది. దీంతో పాటు ప్రధాని మోదీ చిత్రాన్ని కూడా బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి  నరేంద్ర మోదీకి స్వాగతం అంటూ వీడియోతో పాటు సందేశం కూడా రాశారు. 

 

WATCH | Dubai's Burj Khalifa displayed the colours of the Indian national flag yesterday ahead of PM Modi's official visit to the country pic.twitter.com/xQ9e7cJ6uH

— ANI (@ANI) July 15, 2023