కరోనా ఎఫెక్ట్.. మోడీకి తగ్గుతున్న క్రేజ్

కరోనా ఎఫెక్ట్.. మోడీకి తగ్గుతున్న క్రేజ్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న క్రేజ్ తగ్గుతోందని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా డజన్ మంది లీడర్లపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృభిస్తుండటం..రోజురోజుకీ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోవడంతో ఆ ఎఫెక్ట్ మోడీ క్రేజ్ మీద ప్రభావం చూపిందని మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. ఈ వారం మోడీ పాపులారిటీ 63 శాతంగా ఉంది. 2019 నుంచి మోడీ క్రేజ్ ను సర్వే చేస్తున్న మార్నింగ్ వాక్.. ఆయన అప్రూవల్ ఇంతగా తగ్గడం రెండేళ్లలో ఇదే మొదటిసారి అని తెలిపింది.