న్యూఢిల్లీ: పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సెప్టెంబర్తో ముగిసిన రెండో క్వార్టర్లో 12 శాతం గ్రోత్తో రూ. 263 కోట్ల నికర లాభం ప్రకటించింది. కిందటేడాది ఈ నికర లాభం రూ. 235 కోట్లు. సెప్టెంబర్ 2022 క్వార్టర్లో పీఎన్బీ హౌసింగ్ ఆదాయం కూడా అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లోని రూ. 1,586 కోట్ల నుంచి రూ. 1,683 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం 6.5 శాతం అధికమై రూ. 1,597 కోట్లయింది.
ఖర్చులు కూడా 4 శాతం పెరిగి రూ. 1,343 కోట్లకు చేరినట్లు పీఎన్బీ హౌసింగ్ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏర్పాటు చేసిన పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఇండ్ల కొనుగోలుతోపాటు, కమర్షియల్ ప్రాపర్టీలకూ లోన్లు ఇస్తుంది. రిజల్ట్స్ ప్రకటన నేపథ్యంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు గురువారం సెషన్లో 4.59 శాతం పెరిగి 451.1 వద్ద క్లోజయ్యాయి.