ఏ ఒక్కరితోనో తెలంగాణ రాలేదు : అందె శ్రీ

ఏ ఒక్కరితోనో తెలంగాణ రాలేదు : అందె శ్రీ

ఏ ఒక్కరితోనో తెలంగాణ రాలేదని, ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా మంది పోరాడారని ప్రముఖ కవి అందె శ్రీ అన్నారు. కేసీఆర్ కు ఎదురుమాట్లాడితే అడుగడుగునా అరెస్టులేనన్నారు. అధికారాన్ని బిక్షమడిగిన కేసీఆర్ కే అంత ఉంటే.. బిక్షేమేసిన వారికి ఎంత ఉండాలె అని ఆయన ప్రశ్నించారు. 

సాహిత్యాన్ని ప్రస్తుత, భవిష్యత్ తరాలకు అందించాలని ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందెశ్రీ రచించిన నిప్పుల వాగు పుస్తకం ఆవిష్కరణ సభ జగింది. ఎవరికి సలామ్ చేయనిదే నిప్పులవాగు పుస్తకమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న రచయితలు తెలిపారు.