విశాఖపట్టణంలోని గోపాలపట్టణంలో ఉన్న ఎల్.జి. పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహ ముగ్గురు చనిపోయారు. వీరిలో ఇద్దరు వృద్ధులు విషవాయువుల వల్ల కళ్లు కనిపించక బావిలో పడి చనిపోయారు. చిన్నారి మాత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడి చనిపోయినట్లు తెలుస్తోంది. విష వాయువులు మూడు కిలోమీటర్ల మేరకు వ్యాపించాయి. గ్యాస్ లీకేజీతో అక్కడి చుట్టుపక్కల ప్రజలు చాలామంది అపస్మారకస్థితిలోకి వెళ్లారు. అస్వస్థతకు గురైన వారికి స్థానిక కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ దాదాపు 80 మందికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. విషవాయువులు లీక్ అవడంతో ఆర్.ఆర్. వెంకటాపురం పరిసరాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లాక్డౌన్ తో మూసేసిన ఫ్యాక్టరీ ఇన్ని రోజుల తర్వాత ఓపెన్ చేయడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్లాస్టిక్ తయారీకి వాడే స్టైరిన్ కార్బన్ తెల్లవారుజామున 3 గంటలకు కంపెనీ నుంచి లీకైనట్లు అధికారులు గుర్తించారు. గ్యాస్ లీకేజీ వల్ల చర్మంపై దద్దర్లు, కళ్లలో మంటలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చాలామందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇబ్బందులు పడుతున్న వారందరినీ అంబులెన్స్ లో కేజీహెచ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కవగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. కంపెనీ ముందు నుంచి వెళ్తున్న వాళ్లు కూడా ఎక్కడికక్కడ పడిపోతున్నారు. దాంతో కంపెనీకి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. స్థానిక జనాలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. ఘటనాస్థలానికి కలెక్టర్ వినయ్ చంద్, కమిషనర్ ఆర్.కే. మీనా మరియు ఉన్నతాధికారులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి అవంతి శ్రీనివాస్ హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ కూడా ఘటనపై అధికారులను ఆరా తీశారు.
ప్లాస్టిక్ కంపెనీలో గ్యాస్ లీక్.. రోడ్డుపై ఎక్కడికక్కడ పడిపోతున్న జనాలు
- ఆంధ్రప్రదేశ్
- May 7, 2020
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు