వీళ్లు నర హంతకులు : రోగం వస్తే మింగే మందులు కూడా నకిలీ తయారీ

వీళ్లు నర హంతకులు : రోగం వస్తే మింగే మందులు కూడా నకిలీ తయారీ

డాక్టర్ ని దేవుడితో సమానంగా భావిస్తాం. మందులు తయారు చేసేవారు కనిపించని దేవుళ్లలా అనుకుంటాం. కానీ కొందరి ధన దాహానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. చివరికి రోగికి ఇచ్చే మెడిసన్స్ ని కూడా కల్తీ సరకుతో చేసి సంపాదించాలనే దుర్భుద్ధి కొందరిలో ఉండటం బాధాకరం. అలా ఫేక్ మెడిసన్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు.  వారు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురిలోని మారుతీ నగర్ లో ఓ గోదాంలో ముఠా ఫేక్ మెడిసిన్స్ తయారు చేస్తోంది. సమాచారం అందుకున్న ఎస్ ఓ టీ పోలీసులు జూన్ 15న దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో లేబుల్ లేని, డేట్ ఎక్స్ పైరీ అయిన మెడిసెన్స్ ఉన్నట్లు గుర్తించారు.  ఆపరేషన్ డ్రగ్ ఇండియా పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారి నుంచి రూ. కోటి విలువ చేసే ఫేక్ మెడిసిన్ ని సీజ్ చేశారు.  గుట్టు చప్పుడు కాకుండా నిందితుడు ఉమేష్ బాబులాల్ ని అరెస్ట్ చేశారు.  అనంతరం అతన్ని డ్రగ్ కంట్రోలర్ ఆఫీసర్ కు అప్పగించారు.  దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.