లింగంపేట మండలంలో..బెల్ట్​షాప్​పై పోలీసుల దాడి

లింగంపేట మండలంలో..బెల్ట్​షాప్​పై పోలీసుల దాడి
  •     రూ.లక్ష విలువజేసే లిక్కర్​ బాటిళ్ల సీజ్​

లింగంపేట,వెలుగు : లింగంపేట మండలం మోతెలోని బెల్ట్​షాప్​పై పోలీసులు శనివారం రాత్రి దాడి చేసి రూ.లక్ష విలువజేసే మద్యం బాటిళ్లను  సీజ్​చేశారు. నిర్వాహకుడు బద్ధం ప్రతాప్​రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్యరెడ్డి తెలిపారు. బెల్ట్​షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ వెంట కానిస్టేబుళ్లు రామస్వామి, రవి ఉన్నారు.