బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడి ఇంట్లో పోలీసుల సోదాలు

బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడి ఇంట్లో పోలీసుల సోదాలు
  • బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడి ఇంట్లో పోలీసుల సోదాలు
  • 700కు పైగా చీరలు స్వాధీనం
  • బతుకమ్మ పండుగకు పంచగా మిగిలాయన్న వెరబెల్లి
  • బీజేపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న రఘునాథ్​రావు 

మంచిర్యాల, వెలుగు : బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు ఇంట్లో ఆది వారం రాత్రి పోలీసులు సోదాలు చేశారు. టౌన్​సీఐ ముష్కె రాజు, ఎలక్షన్ ​ఫ్లయింగ్​ స్క్వాడ్ ​ఆధ్వర్యంలో రాత్రి 11 గంటలకు పట్టణంలోని హైటెక్​సిటీలో రఘునాథ్​ నివాసంతో పాటు బంధువుల ఇండ్లలో తనిఖీలు జరిపారు. చీరలు పంచుతున్నారని ఫిర్యాదు రావడంతో సోదాలు చేసి 700కు పైగా చీరలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

కోడ్​కు ముందు రఘునాథ్​ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంచారు. కోడ్ ​వచ్చిన తర్వాత పంపిణీ నిలిపివేసి మిగిలిన చీరలను ఓ గదిలో ఉంచి తాళం వేశారు. అయినప్పటికీ ఆ చీరలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసులు, ఎలక్షన్​అధికారులు కాంగ్రెస్, బీఆర్ఎస్​ లీడర్లను వదిలిపెట్టి బీజేపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రఘురాథ్ ​వెరబెల్లి ఆరోపించారు.