భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వేర్వేరు చోట్ల పోలీసుల రక్తదానం

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వేర్వేరు చోట్ల పోలీసుల రక్తదానం

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం/మణుగూరు, వెలుగు : పోలీస్​అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వేర్వేరు చోట్ల బ్లడ్​డొనేషన్​క్యాంపులు నిర్వహించారు. కొత్తగూడెం ఐఎంఏ హాల్​లో నిర్వహించిన శిబిరంలో ఓఎస్డీ టి.సాయి మనోహర్ పాల్గొన్నారు. పోలీసులతోపాటు పలువురు యువకులు కలిపి 120 మంది బ్లడ్​డొనేట్​చేశారు. వారికి ఓఎస్డీ సాయి ఫ్రూట్స్​ఇచ్చారు.

ఏఆర్​అడిషనల్ ఎస్పీ విజయబాబు, డీఎస్పీ రెహమాన్, సీఐలు నాగరాజు, పెద్దన్న కుమార్, కరుణాకర్, మురళి, రమేశ్​పాల్గొన్నారు. అలాగే భద్రాచలంలో నిర్వహించిన క్యాంప్​లో స్థానిక ఏఎస్పీ పంకజ్​పరితోశ్, సీఐ నాగరాజురెడ్డి, ఎస్సైలు, సిబ్బంది బ్లడ్​డొనేట్​చేశారు. మణుగూరు క్యాంప్​లో స్థానిక డీఎస్పీ ఎస్.వి.రాఘవేంద్రరావు, సీఐ రమాకాంత్, ఎస్సై రాజేశ్​కుమార్, స్థానికులు బ్లడ్​ఇచ్చారు.