ముదిగొండలో కిరణా షాప్‌లో గంజాయి చాక్లెట్లు అమ్మకం

ముదిగొండలో కిరణా షాప్‌లో  గంజాయి చాక్లెట్లు అమ్మకం

ముదిగొండ, వెలుగు : ముదిగొండ మండల కేంద్రంలో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న వ్యక్తులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉమేశ్ కుమార్, రంకు కుమార్ గా తేలింది. వారిద్దరూ ముదిగొం డలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పాలిషింగ్ కార్మికు లుగా పని చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మీశ్రీ పట్టణంలో ఉండే వికాస్ అనే వ్యక్తి కిరాణా షాపు నుంచి గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేసి ముదిగొండకు తీసుకువస్తారు. అదే గ్రామంలో గుమ్మడి సత్యనారాయణ కిరాణా షాప్కు తక్కువ రేటుకు అమ్ముతుంటారు. సత్యనారాయణ పారి శ్రామిక ప్రాంతంలో ఉన్నయువతకు, కార్మికుల కు ఎక్కువ రేట్లకు అమ్ముతుంటాడు. 

ఇటీవల 13 గంజాయి ప్యాకెట్లను తీసుకురాగా, అందులో కొన్ని విక్రయించగా మరో రెండు ప్యాకెట్లు మిగిలాయి. వాటిని కూడా సత్యనారాయణకు విక్రయించేందుకు షాపు దగ్గరికి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి ఇద్దరితోపాటు సత్యనారాయణను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.15వేల విలువైన ఏడు గంజాయి ప్యా కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్యాకెట్ లో 40గంజాయి చాక్లెట్లు ఉన్నాయి. వారినుంచి మూడు సెల్ ఫోన్లను కూడాపోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఎవరైనా గంజాయి అమ్మితే చర్యలు తీసుకుంటామని సీఐ మురళీ హెచ్చరించారు. ఈ దాడుల్లో ట్రైనింగ్ ఎస్సై హరిత, రైటర్ వెంకన్న ఉన్నారు.