పొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట్టింగ్

పొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట్టింగ్

క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పోలీసుల దాడి..

ఛేజ్ చేసి 8 మందిని పట్టుకున్న పోలీసులు.. మరో ఐదుగురు పరార్

అనంతపురం: పొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 8 మంది యువకులను పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. సోమందెపల్లి మండలం మేకల పల్లి గ్రామములో జరిగిందీ ఘటన. పొలం పనులు చేయకుండానే ఖాళీగా ఉండడమే కాకుండా.. క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ.. వ్యసనానికి బానిసలుగా మారుతున్నారన్న సమాచారంతో సోమందెపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. ఊహించని రీతిలో మఫ్టీలో వచ్చిన పోలీసులను గుర్తించిన బెట్టింగ్  రాయుళ్లు.. పొలం గట్ల వెంబడి పరిగెత్తి పారిపోయే ప్రయత్నం చేశారు. మాటు వేసిన పోలీసులు.. బెట్టింగ్ రాయుళ్లు  8 మందిని అదుపులోకి తీసుకోగా మారో ఐదుగురు పరారయ్యారు.  క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వారి వద్ద  15 వేల నగదు 8 మొబైల్ ఫోన్ లు సీజ్ చేశారు.  కేసు నమోదు చేయడం జరిగింది, ఇంక 5 మంది పారిపోయారు వారి మీద కూడా కేస్ నమోదు చేసినట్లు సోమందేపల్లి పోలీసులు తెలిపారు.