గడ్డం వంశీ కృష్ణ కారును తనిఖీ చేసిన పోలీసులు

గడ్డం వంశీ కృష్ణ కారును తనిఖీ చేసిన పోలీసులు

ఎంపీ ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో పోలీసులు చెక్ పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కారును పోలీసులు తనిఖీ చేశారు. పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లాలో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు వంశీ. ఈ క్రమంలోనే గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జిపై పోలీసులు చెక్ పోస్టు పెట్టారు. అటుగా వస్తున్న వంశీ కారును తనిఖీ చేశారు.

ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు గడ్డం వంశీ పోలీసులకు పూర్తిగా సహకరించారు. ఆయన వాహనంతో పాటు తన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు.