హైదరాబాద్ లోని బొడుప్పల్ లోని క్యూ న్యూస్ ఆఫీస్లో CCS పోలీసుల తనిఖీలు చేశారు. నిన్న TRS సోషల్ మీడియా కన్వీనర్ CCS సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదుతో క్యూ న్యూస్ లో పోలీసులు సోదాలు చేశారు. 165 CRPC కింద నోటీసులు జారీ చేసి క్యూ న్యూస్ లో సోదాలు చేశారు. మూడు గంటలు సోదాలు చేసిన పోలీసులు.. 26 హార్డ్ డిస్క్ లు,సీసీ కెమెరాల ఫుటేజీ,2 ఫోన్లు,పలు కంప్యూటర్లు, స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయం తెలుసుకుని క్యూ న్యూస్ ఆఫస్ దగ్గరకు వెళ్లిన మీడియాపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. లోపలికి మీడియాను పోలీసులు అనుమతించలేదు. కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకుని మేడిపల్లి పీఎస్ కు తరలించారు. పోలీసుల తీరుపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్ CCS సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.