
హైదరాబాద్ పోలీసులు కార్టెన్ సర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసినా వందలాది మంది విదేశీయులు అక్రమంగా ఉంటున్నట్లు సమాచారంతో తనిఖీలు చేశారు. మల్కాజ్ గిరి డీసీపీ పద్మజా రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం 160 మంది పోలీసులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధి వినాయక్ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 160 మంది పోలీస్ సిబ్బందితో వినాయక్ నగర్ లోని ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు.
తనిఖిలలో భాగంగా 51 బైకులు, అనుమతి లేకుండా అమ్ముతున్న 32 లీటర్ల మద్యాన్ని, నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి డిసిపి పద్మజా రెడ్డి మాట్లాడుతూ బస్తీలలో అన్నిచోట్ల పోలీసులతో కలిసి కాలనీ వాసులు సీసీటీవీ ఏర్పాటు చేసుకోవాలని.. తద్వారా జరుగుతున్న నేరాలను తగ్గించే ప్రయత్నం చేయవచ్చునని సూచించారు.
పారామౌంట్ కాలనీలో వందలాది నైజీరియన్లు:
శుక్రవారం (జూన్ 20) తెల్లవారుజాము నుంచి నిర్విరామంగా కార్టెన్ సర్చ్ కొనసాగించారు పోలీసులు. పారా మౌంట్ కాలనీలో వందలాది మంది నైజీరియన్లు ఉంటున్నట్లు వచ్చిన సమాచారంతో తెల్లవారుజామున 3 గంటలకు కార్డెన్ సెర్చ్ మొదలుపెట్టారు. డాక్యుమెంట్స్ చెక్ చేసిన పోలీసులు.. ఎలాంటి పత్రాలు లేని కార్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు.
వీసా గడువు ముగిసినా.. అక్రమంగా ఉంటున్న నైజీరియన్ల గుర్తించారు. 50 కి పైగా బైకులు, 5 కార్లు.. గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న బెల్ట్ షాపులను గుర్తించారు. పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు. హుక్కా ప్లాట్లు.. సిలిండర్లు సీజ్ చేశారు.