అమరుడా నీకు వందనం : ఎన్ కౌంటర్ లో జవాన్ మృతి

అమరుడా నీకు వందనం : ఎన్ కౌంటర్ లో జవాన్ మృతి

చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో మావోయిస్టులతో జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ అమరుడయ్యాడు. తొంగుడా- పమేడా ప్రాంతంలో కోబ్రా దళాలతో పాటు CRPF జవాన్లు కూంబింగ్ చేస్తుండగా.. ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.

చనిపోయింది 151వ బెటాలియన్ కు చెందిన జవానుగా గుర్తించారు. ఎదురుకాల్పుల్లో కొందరు మావోయిస్టులు కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ ముమ్మరం చేశారు జవాన్లు. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేశారు. జవాన్ మృతితో అతడి ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.