డీజీపీ ఆఫీస్ ముట్టడి.. బీజేవైఎం నాయకులపై కేసు నమోదు

డీజీపీ ఆఫీస్ ముట్టడి.. బీజేవైఎం నాయకులపై కేసు నమోదు

డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం నాయకులపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సహా 20మందిపై క్రిమినల్ ట్రెస్పాస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఒక్కసారిగా వచ్చిన నాయకులు ప్రధాన కార్యాలయ గేటును తోసుకొని లోపలికి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులకు పోలీసులకు తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.