హైవేపై గుంతలు పూడ్చిన పోలీసులు

హైవేపై గుంతలు పూడ్చిన పోలీసులు

కల్లూరు, వెలుగు: రోడ్లపై పెద్ద పెద్ద గుంతలను చూసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు పోలీసులు తమదైన శైలిలో స్పందించారు.  పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎస్ ఐ ఎండీ రఫీ, పోలీసు సిబ్బంది నేషనల్ హైవే పై ఏర్పడిన పెద్దపెద్ద గుంతలను జేసీబీలతో లెవెలింగ్ చేయించి పూడ్చి వేయించారు. హనుమతండా నుంచి యన్ ఎస్ పీ తిరువూరు క్రాస్ రోడ్డు వరకు రోడ్డు చెడిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే సొంత ఖర్చుతో రిపేర్ చేయించానన్నారు. తమ పరిధిలోకి రాకున్నా పోలీసులు చొరవ తీసుకుని రోడ్డు మరమ్మత్తు చేయించడంపై స్థానికులు… పాదచారులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులను అభినందించారు.