పంజాగుట్ట, వెలుగు: అకారణంగా కల్లు సొసైటీ దుకాణాలపై పోలీసులు చేస్తున్న దాడులను అరికట్టాలని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలీసుల దాడులతో కల్లు సొసైటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బేగంటపేటలోని హోటల్హరిత ప్లాజాలో శనివారం సంఘం రాష్ట్ర కార్య వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్రావు గౌడ్ మాట్లాడుతూ.. లిక్కర్ మాఫియాతో పోలీసులు కుమ్మక్కై బైండవర్పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా103 సొసైటీల్లో మొత్తం 61 వేల మంది సభ్యులున్నారని చెప్పారు. గత ప్రభుత్వం సంఘ భవనం కోసం కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల్లో, భవనం నిర్మించి నిధులు విడుదల చేయాలన్నారు. కల్లు గీసే టైంలో గీత కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్చేశారు.
ప్రతి జిల్లాలో తాటి చెట్ల పెంపకానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని, పనిముట్లు అందజేయాలని కోరారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్గౌడ్, ఉపాధ్యక్షుడు సంతోశ్గౌడ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనురాధ గౌడ్, సిటీ అధ్యక్షుడు దేవేందర్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ముఖేష్గౌడ్, ఉపాధ్యక్షుడు ప్రతాప్లింగం గౌడ్, లక్ష్మీపతి, జిల్లాలు, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.