
హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు 3 కమిషనరేట్ల పరిధిలోని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లను క్లోజ్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఓఆర్ఆర్పై ఎయిర్పోర్ట్ ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. ట్రావెల్ చేసే వారి వద్ద ఫ్లైట్ టికెట్స్ తప్పనిసరిగా ఉండాలి.
పీవీ ఎక్స్ప్రెస్ హైవే, లంగర్ హౌస్ ఫ్లై ఓవర్, బేగంపేట్ ఫ్లై ఓవర్ మినహా సిటీలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తారు. ట్యాంక్బండ్, ఎన్టీఆర్మార్గ్, నెక్లెస్రోడ్తో పాటు దుర్గం చెరువు కేబుల్బ్రిడ్జిని క్లోజ్ చేయనున్నారు. పీవీఎన్ఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్లో ఆదివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఆంక్షలు విధించారు. ఈ టైమ్లో వెహికల్స్ ను అనుమతించరు. ఈ రూట్లో ప్రయాణించే వాహనదారులు ఇతర మార్గాల్లో ట్రావెల్ చేయాలని పోలీసులు తెలిపారు.