కూకట్పల్లి/బషీర్బాగ్/సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్పరిధిలో శుక్రవారం వేర్వేరుచోట్ల నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు రూ.93.05లక్షల క్యాష్పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్బీకాలనీ పరిధిలోని జేఎన్టీయూ వద్ద బాలానగర్ ఎస్ఓటీ టీమ్, కేపీహెచ్బీ పోలీసులు తనిఖీ చేస్తుండగా రైటర్పీవీఎస్లాజిస్టిక్స్కు సంబంధించిన వెహికల్అటుగా వచ్చింది. ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా తరలిస్తున్న రూ.25.50 లక్షలు పట్టుబడింది. నగదును స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్చేశారు. అబిడ్స్ పోలీసులు హనుమాన్ టెక్డీ ప్రాంతంలో వెహికల్స్తనిఖీ చేస్తుండగా, బైక్పై వెళ్తున్న ఇద్దరి వద్ద రూ.49.75లక్షలు పట్టుబడింది.
ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేశారు. అలాగే మార్కెట్పోలీసులు శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ ఆశా పాన్ షాప్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో సంతోష్, కృష్ణ అనే బైక్వెళ్తుండగా ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద రూ.17.80 లక్షల నగదు దొరికింది. తాము నిర్మల్ జువెలర్స్ లో పనిచేస్తన్నామని, షాపు యజమాని బ్యాంకులో డిపాజిట్చేయమని చెప్పడంతో, తీసుకెళ్తున్నామని చెప్పారు. ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో పోలీసులు సీజ్చేశారు.