రూ.2.31 కోట్ల స్పిరిట్ పట్టివేత

రూ.2.31 కోట్ల స్పిరిట్ పట్టివేత

జీడిమెట్ల, వెలుగు: దూలపల్లి ఇండస్ట్రియల్​ఏరియాలోని ప్లాట్ నం.125లోని  శ్రీజగదాంబ కెమికల్స్​గోడౌన్ లో భారీగా స్పిరిట్ నిల్వచేశారని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. గురువారం రైడ్​ చేసి 105 డ్రమ్ముల్లో  21 వేల  లీటర్ల స్పిరిట్ ను ​పట్టుకున్నారు.  దీని విలువ మార్కెట్ లో రూ.2.31కోట్లు ఉంటుందని తెలిపారు. నిర్వాహకులు హనుమాన్ రామ్​సేన్, శ్రవణ్ కుమార్ ను అరెస్టు చేసి, గోడౌన్ ను సీజ్ చేశారు.